ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
- December 25, 2024
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుద్దీపాల అలంకరణలతో కనపడుతున్నాయి. కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి రోమన్ క్యాథలిక్ మెట్రోపాలిటన్ కేథడ్రల్ను లైట్లు, క్రిస్మస్ క్రిబ్లతో అందంగా అలంకరించారు.
మెదక్ చర్చలో… ఇక తెలంగాణలోని మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రాతఃకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం శిలువను ఉరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఇన్చార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు. మెదక్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్నారులకు వినోదం పంచేందుకు చర్చి ఆవరణలో రంగులరాట్నం ఏర్పాటు చేశారు. ముప్పై ఏళ్ల క్రితం చిన్న పాకలో ప్రార్ధనలతో మొదలైనది అంచెలంచెలుగా విస్తరించింది. నేడు, ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా మారింది. ఇది ఒకేసారి 40 వేల మందికి పైగా ప్రార్థన చేయడానికి సౌకర్యాలను కలిగి ఉంది.
ఖమ్మం జిల్లాలో
ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా చర్చీలు ముస్తాబు అయ్యాయి. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని సీఎస్ఐ చర్చిలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ జిల్లాలో
హనుమకొండ జిల్లా కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి ప్రార్థనలతో మార్మోగింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిసరాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ప్రార్థనా మందిరం క్రైస్తవ ఆరాధన, పాటలు , దేవుని పదాల పఠనంతో నిండిపోయింది. వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాజీపేటలోని పలు ప్రార్థనా మందిరాలు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిశాయి. రాత్రి ప్రత్యేక పూజలు భక్తులను అలరించాయి. కాజీపేటలోని ఫాతిమానగర్ చర్చిలో అర్ధరాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఎపిలో… ఎపిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. గుణదల మేరిమాత చర్చికి భక్తులు నేడు పోటెత్తారు.. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.. అలాగే ఎపిలో చర్చిలలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
ఇక తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచంలో మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏసు ప్రభువు ఆశయాలను గౌరవించేందుకు క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా క్రైస్తవులకు క్రిస్మస్ గ్రీటింగ్ తెలిపారు.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్రిస్మస్ సందేశంలో క్రీస్తు బోధనలు సర్వదా ఆచరణీమని అన్నారు.



తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









