'బాబు బంగారం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది..

- June 27, 2016 , by Maagulf
'బాబు బంగారం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది..

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బాబు బంగారం' సినిమాతో త్వరలో వినోదాల విందు వడ్డించనున్నారు వెంకటేష్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల గచ్చిబౌలిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చిందట. ఈ పాట కోసం చెన్నైలో ప్రత్యేక సెట్ సిద్ధం చేయించారట దర్శకుడు. జులై 4 నుండి 8 వరకు జరుగనున్న షూటంగ్‌తో ఈ పాట కూడా పూర్తవుతుందట. జిబ్రాన్ స్వరాలు సమకూర్చిన పాటలు జులై 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయట. జులై 29 నాటికి 'బాబు బంగారం'ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com