మహిళ కారుపై ' అభ్యంతరకరమైన' నోట్..యువకుడికి 1,000 దిర్హామ్ల జరిమానా..!!
- December 29, 2024
యూఏఈ: పబ్లిక్ డీసెన్సీ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత 19 ఏళ్ల ఎమిరాటికి 1,000 దిర్హామ్ల జరిమానా విధించారు. పోర్ట్ రషీద్ ప్రాంతంలోని కేఫ్ సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడు ఒక మహిళ కారుపై అభ్యంతరకరమైన చేతిరాతతో రాసిన నోట్ను పెట్టాడు. అందులో అభ్యంతరకరమై, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 10, 2023న జరిగింది. నోట్ను గుర్తించిన వెంటనే, భర్త దానిని ఫోటో తీసి తన భార్యకు పంపాడు. ఆమె వెంటనే సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీని పరిశీలించి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు కారు ఓనర్ ఎవరో తెలియదని, ఆమెతో ఎలాంటి ముందస్తు పరిచయం లేదని, సరదాగా రాసినట్లు విచారణలో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









