ఒక్క ఫొటోతో అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర
- January 08, 2025
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఆయన ఎక్స్లో చేసే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా, ఆనంద్ మహీంద్ర మరో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు. రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ బైకు వెనకాల కూర్చున్న వ్యక్తి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పట్టుకున్నాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తికి ఓ పక్క భక్తి భావం ఉంది కానీ, ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించడంలేదు. ఆ బైకుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు.
ఈ విషయాలన్నింటినీ గుర్తించిన ఆనంద్ మహీంద్ర దీనిపై స్పందిస్తూ.. “ట్రాఫిక్ లైట్ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది” అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







