ఒక్క ఫొటోతో అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర
- January 08, 2025
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఆయన ఎక్స్లో చేసే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా, ఆనంద్ మహీంద్ర మరో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు. రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ బైకు వెనకాల కూర్చున్న వ్యక్తి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పట్టుకున్నాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తికి ఓ పక్క భక్తి భావం ఉంది కానీ, ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించడంలేదు. ఆ బైకుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు.
ఈ విషయాలన్నింటినీ గుర్తించిన ఆనంద్ మహీంద్ర దీనిపై స్పందిస్తూ.. “ట్రాఫిక్ లైట్ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది” అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









