విజిట్ వీసా టూ వర్క్ పర్మిట్.. ఎంపీల్లో భిన్నాభిప్రాయాలతో నిలిచిన ఓటింగ్..!!
- January 08, 2025
మనామా: విజిట్ వీసా ను వర్క్ పర్మిట్ గా మార్పు చేసే ముసాయిదా చట్టంపై ఓటింగ్ ను నిలిపివేయాలని బహ్రెయిన్ పార్లమెంటు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఎంపీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ఇది స్థానికులకు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయని అనగా, మరి కొందరు జాబ్ మార్కెట్ కు లో కాస్ట్ లేబర్ అందుబాటును దెబ్బతీస్తుందని, తద్వారా పారిశ్రామిక వృద్ధితోపాటు కీలక రంగాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముసాయిదా చట్టం 1965 ఎలియెన్స్ (ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్స్) చట్టాకి సవరణ చేయడం ద్వారా ఎంట్రీ వీసాలను వర్క్ పర్మిట్ గా మార్చే పద్ధతిని పూర్తిగా నిషేధించనున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ హసన్ బుఖమాస్ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు సమయం కావాలని పార్లమెంటును కోరడంతో ఆమోదించారు. చౌకైన విదేశీ లేబర్ ను అడ్డుకోవాలని, ఇది బహ్రెయినీలకు ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపి జలాల్ కధేమ్ అన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







