బహ్రెయిన్ లో విదేశీ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లకే ప్రభుత్వ ఉద్యోగాలు..!!
- January 11, 2025
మనామా: ప్రభుత్వ రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న విదేశీయులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న వివాదాస్పద బిల్లు చర్చకు వచ్చింది. ప్రధాన కమిటీలు, సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) ఆందోళనలను పెంచడంతో, ప్రతినిధుల సభలో బిల్లుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ బిల్లు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విదేశీయులకు పరిమితం చేస్తుంది. దాంతోపాటు కాంట్రాక్టులు రెండు సంవత్సరాలకు పరిమితం అవుతాయి. ఒకసారి మాత్రతే పునరుద్ధరణకు అనుమతిస్తారు.
విదేశీ పౌరుల నియామక నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు నైపుణ్యం కొరతను సృష్టించవచ్చని, కీలక రంగాలకు అంతరాయం కలిగించవచ్చని, రిక్రూట్మెంట్ ప్రక్రియలను దెబ్బతీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. CSB, షురా కౌన్సిల్ లెజిస్లేటివ్, లీగల్ అఫైర్స్ కమిటీ ఈ ప్రతిపాదన అసాధ్యమని, రాజ్యంలో 90% పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలకు హాని కలిగించవచ్చని వాదిస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో విదేశీ కార్మికులు ఇప్పటికే తగ్గుముఖం పట్టారు. CSB డేటా గత ఐదేళ్లలో 23% తగ్గుదలని చూపుతోంది. 2019లో 7,582 నుండి 2024లో 5,800కి పడిపోయింది. బహ్రెయిన్లు ఇప్పుడు ప్రభుత్వ రంగ శ్రామికశక్తిలో 86% ఉన్నారు. విదేశీ పౌరులు 14% మాత్రమే ఉన్నారు. ఇలాంటి కఠిన నిబంధనలు విధించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని బ్యూరో హెచ్చరించింది. హెల్త్కేర్, ఎడ్యుకేషన్ రంగాలు ఎక్కువగా దెబ్బతింటాయని CSB నొక్కి చెప్పింది. ఈ ప్రతిపాదన గణనీయమైన నైపుణ్యాల కొరతకు, కార్యకలాపాలకు విఘాతం కలిగించడానికి, అవసరమైన సేవలను ప్రభావితం చేయడానికి దారితీయవచ్చని ఆందోళనలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







