షాప్ ఖతార్ 2025.. మొదటి రాఫిల్ డ్రా విజేతల ప్రకటన..!!
- January 12, 2025
దోహా: షాప్ ఖతార్లో జరిగిన మొదటి రాఫిల్ డ్రాలో గొప్ప బహుమతుల గెలిచిన అదృష్ట విజేతల వివరాలను ప్రకటించారు. విజిట్ ఖతార్ నిర్వహిస్తున్న అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా మొదటి డ్రాను జనవరి 10న మాల్ ఆఫ్ ఖతార్లో నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే షాపింగ్ ఫెస్టివల్లో మొత్తం నాలుగు రాఫిల్ డ్రాలను నిర్వహిస్తారు. ఖర్చు చేసిన ప్రతి QR200 కోసం డ్రాలో ప్రవేశించడానికి అర్హత పొందుతారు.
రాబోయే మూడు డ్రాలు జనవరి 17న లుసైల్ బౌలేవార్డ్లో, జనవరి 24న ప్లేస్ వెండోమ్లో, ఫిబ్రవరి 1న దోహా ఫెస్టివల్ సిటీలో జరుగుతాయి. ప్రతి శుక్రవారం లక్కీ విజేతల ఎంపిక చేస్తారు. వారికి విలాసవంతమైన ఎక్సీడ్ కార్లు, QR10,000 నుండి QR100,000 వరకు నగదు బహుమతులు, టెస్లా సైబర్ట్రక్ వంటి గొప్ప బహుమతితో సహా అసాధారణమైన బహుమతులను గెలుచుకోవచ్చు.
మొదటి రాఫిల్ డ్రాలో అదృష్ట విజేతలు:
Exeedని షెరీఫ్ సెలిమ్ గెలుచుకున్నారు. (వోచర్ నంబర్ 0099876)
మాగ్డలీనా బినియాస్ (వోచర్ నంబర్ 0012331) QR100,000 గెలుచుకున్నారు.
అబ్దుల్కరీమ్ ముస్తఫా (వోచర్ నంబర్ 0575984) QR50,000 గెలుచుకున్నారు.
జే కిమ్ (వోచర్ నంబర్ 0445611) QR30,000 గెలుచుకున్నారు.
QR20,000 మొత్తాన్ని ఖిదర్ మొహమ్మద్ (వోచర్ నంబర్ 0264503), జండీ రామోస్ ఒడియోంగన్ (వోచర్ నంబర్ 0190293) గెలుచుకున్నారు.
ముగ్గురు విజేతలు QR10,000 నగదు బహుమతిని పొందారు - అఫ్రా అబ్దుల్లా (వోచర్ నంబర్ 0382285), ముబారక్ సయీద్ MA అల్-కాబీ (వోచర్ నంబర్ 0574850), తారెక్ సాబెర్ (వోచర్ నంబర్ 0478414)
షాప్ ఖతార్ ఫిబ్రవరి1 వరకు కొనసాగుతుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ షాపింగ్ మాల్స్, షాపింగ్ జిల్లాల్లోని ప్లేస్ వెండోమ్, దోహా ఫెస్టివల్ సిటీ, మాల్ ఆఫ్ ఖతార్, సిటీ సెంటర్ మాల్, ల్యాండ్మార్క్ మాల్, విల్లాజియో, లగూనా మాల్, అల్ హజ్మ్, హయత్ ప్లాజా , తవార్ మాల్, అల్ ఖోర్ మాల్, మషీరెబ్ గల్లెరియా, దోహా ఓల్డ్ పోర్ట్, లుసైల్ బౌలేవార్డ్, దోహా ఒయాసిస్, గల్ఫ్ మాల్, అబు సిద్రా మాల్, ది దోహా మాల్, ఎజ్దాన్ అల్ వక్రా, ది గేట్ మాల్ లో జరుగుతుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







