సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు నిందితుడు అరెస్ట్
- January 17, 2025
ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేయగా.. ప్రస్తుతం నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. దొంతగనానికి వెళ్లాడా.. సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా.. ఎవరైనా సఫారీ ఇచ్చారా.. ఏదైనా కుట్రకోణం ఉందా.. ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపై నిందితుడు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలో సైఫ్ లీలావతి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే, నిందితుడు పరారయ్యాడు. సైఫ్ పై దాడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో నిందితుడు మెట్లు దిగి వెళ్తున్నట్లు సీసీటీవీ పుటేజీలో కనిపించింది. బ్యాగ్ తగిలించుకుని, స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. నిందితుడి ఫొటోలనుసైతం పోలీసులు విడుదల చేశారు. దుండగుడిని పట్టుకునేందుకు 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున అనుమానితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు.. ఇతర ప్రాంతాల్లో రాత్రి మొత్తం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి. అయితే, పోలీసులు అతనే సైఫ్ పై దాడి చేసిన నిందితుడని ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ పూర్తయిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







