దావోస్ లో పెట్టుబడుల వేట ప్రారంభించిన సీఎం రేవంత్
- January 21, 2025
దావోస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం రెండో రోజూ దావోస్లో పర్యటిస్తోంది. మంగళవారం దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొని, కేంద్ర మంత్రులతో కలిసి గ్రాండ్ ఇండియా పెవిలియన్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకెళ్తున్నదని చెప్పారు.
బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భారత ప్రభుత్వం లక్ష్యమైన 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.
రేవంత్ బృందం నేటి షెడ్యూల్ …
దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాలుపంచుకుంటుంది. ఈనేపథ్యంలో దావోస్ లో రెండో రోజున పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు సమావేశమవనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు.
అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







