కువైట్ ఎంబసీలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!

- January 22, 2025 , by Maagulf
కువైట్ ఎంబసీలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!

కువైట్: ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న(ఆదివారం) భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. హాజరయ్యే సందర్శకుల కోసం 2వ రింగ్ రోడ్డు చివర అరేబియా గల్ఫ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. (https://maps.app.goo.gl/F4jxS94pFKBVsGw88) అక్కడి నుండి ఎంబసీ ప్రాంగణానికి ఉచిత షటిల్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అయితే, హాజరయ్యేవారు చెల్లుబాటులో ఉన్నసివిల్ ID లేదా భారతీయ పాస్‌పోర్ట్ తీసుకురావాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com