తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- January 22, 2025
తిరుపతి: తిరుపతి లో వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కు ఆదేశించింది.ఈ నెల 8 వ తేదీ రాత్రి తిరుపతి లోని పద్మావతి పార్కు వద్ద టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 6 గురు మరణించాగా మరో 40 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే..
వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుని భాదితుల ఉపశమన చర్యలు కూడా తీసుకున్న విషయం విదితమే.అప్పుడు స్వయంగా తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించారు.
ఆ మేరకు ప్రభుత్వం ఈరోజు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి to న్యాయ విచారణ కు ఆదేశాలు (జి ఓ నెం 16)జారీ చేసింది.మొత్తం ఘటన కు కారణాలు, ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చడం తో పాటు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. మరో ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







