తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- January 22, 2025
తిరుపతి: తిరుపతి లో వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కు ఆదేశించింది.ఈ నెల 8 వ తేదీ రాత్రి తిరుపతి లోని పద్మావతి పార్కు వద్ద టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 6 గురు మరణించాగా మరో 40 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే..
వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుని భాదితుల ఉపశమన చర్యలు కూడా తీసుకున్న విషయం విదితమే.అప్పుడు స్వయంగా తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించారు.
ఆ మేరకు ప్రభుత్వం ఈరోజు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి to న్యాయ విచారణ కు ఆదేశాలు (జి ఓ నెం 16)జారీ చేసింది.మొత్తం ఘటన కు కారణాలు, ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చడం తో పాటు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. మరో ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!