మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- January 25, 2025
యూఏఈ: యూఏఈలో పీర్ ముహమ్మద్ ఆజం అనే 41 ఏళ్ల భారతీయ ప్రవాసుడు జనవరి 11న తన మొదటి ప్రయత్నంలోనే అదృష్టాన్ని పొందాడు. మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్నారు.దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలోని సీనియర్ ఎలక్ట్రీషియన్ అయిన ఆజం యూఏఈ లాటరీ మొదటి మిలియనీర్ అయ్యారు. " నేను లైవ్ డ్రాను చూశాను. విజేత సంఖ్యలను చూశాను. నమ్మలేదు. మళ్లీ ఆన్లైన్లో చెక్ చేసాను. అప్పుడు నేను నిజంగా గెలిచినట్లు నమ్మాను." అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి 20 టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆజం, మరుసటి రోజు వారిని అభినందించేందుకు ఫోన్ చేశానని చెప్పాడు. ప్రైజ్ మనీతో ఏమి చేయాలో అతను ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే తన యూఏఈ లాటరీ కాదని, మళ్లీ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటానని తెలిపారు."నేను 100 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ గెలిస్తే, నేను భూమిపై నిలబడను. ఆనందం, థ్రిల్ తో ఆకాశంలో ఎగిరిపోతాను." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!









