మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- January 25, 2025
యూఏఈ: యూఏఈలో పీర్ ముహమ్మద్ ఆజం అనే 41 ఏళ్ల భారతీయ ప్రవాసుడు జనవరి 11న తన మొదటి ప్రయత్నంలోనే అదృష్టాన్ని పొందాడు. మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్నారు.దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలోని సీనియర్ ఎలక్ట్రీషియన్ అయిన ఆజం యూఏఈ లాటరీ మొదటి మిలియనీర్ అయ్యారు. " నేను లైవ్ డ్రాను చూశాను. విజేత సంఖ్యలను చూశాను. నమ్మలేదు. మళ్లీ ఆన్లైన్లో చెక్ చేసాను. అప్పుడు నేను నిజంగా గెలిచినట్లు నమ్మాను." అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి 20 టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆజం, మరుసటి రోజు వారిని అభినందించేందుకు ఫోన్ చేశానని చెప్పాడు. ప్రైజ్ మనీతో ఏమి చేయాలో అతను ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే తన యూఏఈ లాటరీ కాదని, మళ్లీ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటానని తెలిపారు."నేను 100 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ గెలిస్తే, నేను భూమిపై నిలబడను. ఆనందం, థ్రిల్ తో ఆకాశంలో ఎగిరిపోతాను." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







