మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- January 25, 2025
యూఏఈ: యూఏఈలో పీర్ ముహమ్మద్ ఆజం అనే 41 ఏళ్ల భారతీయ ప్రవాసుడు జనవరి 11న తన మొదటి ప్రయత్నంలోనే అదృష్టాన్ని పొందాడు. మొదటి ప్రయత్నంలోనే Dh1 మిలియన్ గెలుచుకున్నారు.దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలోని సీనియర్ ఎలక్ట్రీషియన్ అయిన ఆజం యూఏఈ లాటరీ మొదటి మిలియనీర్ అయ్యారు. " నేను లైవ్ డ్రాను చూశాను. విజేత సంఖ్యలను చూశాను. నమ్మలేదు. మళ్లీ ఆన్లైన్లో చెక్ చేసాను. అప్పుడు నేను నిజంగా గెలిచినట్లు నమ్మాను." అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి 20 టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆజం, మరుసటి రోజు వారిని అభినందించేందుకు ఫోన్ చేశానని చెప్పాడు. ప్రైజ్ మనీతో ఏమి చేయాలో అతను ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే తన యూఏఈ లాటరీ కాదని, మళ్లీ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటానని తెలిపారు."నేను 100 మిలియన్ దిర్హామ్ల జాక్పాట్ గెలిస్తే, నేను భూమిపై నిలబడను. ఆనందం, థ్రిల్ తో ఆకాశంలో ఎగిరిపోతాను." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







