కీలక రంగాలలో పెట్టుబడులు.. ఒమానీ-ఖతారీ ఫోరమ్ సమీక్ష..!!
- January 29, 2025
మస్కట్: మస్కట్లో సమావేశమైన ఒమానీ-ఖతారీ ఎకనామిక్ ఫోరమ్.. ఒమన్ - ఖతార్ మధ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, తయారీ రంగాలలో ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఒమన్ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ సమావేశమైంది. ఈ పర్యటనలో ఒమన్ - ఖతార్ దౌత్య శిక్షణ, సామాజిక అభివృద్ధి రంగాలలో సహకారం కోసం రెండు అవగాహన ఒప్పందాలు (MOU) కుదిరాయి. వీటితోపాటు సాంస్కృతిక, విద్య, క్రీడలు, యువత సహకారం వంటి కీలక కార్యనిర్వాహక కార్యక్రమాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలు, వివిధ రంగాలలో అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









