కీలక రంగాలలో పెట్టుబడులు.. ఒమానీ-ఖతారీ ఫోరమ్ సమీక్ష..!!
- January 29, 2025
మస్కట్: మస్కట్లో సమావేశమైన ఒమానీ-ఖతారీ ఎకనామిక్ ఫోరమ్.. ఒమన్ - ఖతార్ మధ్య మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, తయారీ రంగాలలో ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఖతార్ ఎమిర్ హిస్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఒమన్ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ సమావేశమైంది. ఈ పర్యటనలో ఒమన్ - ఖతార్ దౌత్య శిక్షణ, సామాజిక అభివృద్ధి రంగాలలో సహకారం కోసం రెండు అవగాహన ఒప్పందాలు (MOU) కుదిరాయి. వీటితోపాటు సాంస్కృతిక, విద్య, క్రీడలు, యువత సహకారం వంటి కీలక కార్యనిర్వాహక కార్యక్రమాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలు, వివిధ రంగాలలో అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







