యాన్బు స్టీమ్ టర్బైన్ యూనిట్లో ప్రమాదం..అనేకమంది కార్మికులు మృతి..!!
- February 03, 2025
రియాద్: యాన్బు ఇండస్ట్రియల్ సిటీలోని మరాఫిక్ కంపెనీకి చెందిన స్టీమ్ టర్బైన్ యూనిట్ బాయిలర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో అనేకమంది కార్మికులు మరణించగా, పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ కథనం ప్రకారం..మరాఫిక్ కంపెనీ ఆవిరి టర్బైన్ యూనిట్లోని ఆరవ యూనిట్ బాయిలర్కు మద్దతు ఇచ్చే యూనిట్లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వార్షిక పీరియాడిక్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం యూనిట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. మంటలు సకాలంలో పూర్తిగా అదుపులోకి వచ్చాయని,ఈ ప్రమాదంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నియమించిన అనేక మంది కార్మికులు మరణించారని తెలిపింది.కాగా, అగ్నిప్రమాదం వల్ల వినియోగదారులకు అందించే సేవలు ప్రభావితం కాలేదని పేర్కొంది.ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులతో కంపెనీ సమన్వయంతో పని చేస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష