దుబాయ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్..600% ఎక్కువకు టిక్కెట్లు రీసేల్..!!
- February 05, 2025
దుబాయ్: ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ పోరు టిక్కెట్లు వాటి అసలు ధర కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. నిజానికి ధర 500, సాధారణ అడ్మిషన్ టిక్కెట్లు ఇప్పుడు Facebook మార్కెట్ప్లేస్, ఇతర క్లాసిఫైడ్ సైట్లలో Dh3,500 వరకు ఉన్నాయి. చాలా మంది క్రికెట్ ఔత్సాహికులు సోమవారం ఆన్లైన్ క్యూలో గంటల తరబడి టిక్కెట్లు కొనాలని ఆశతో ప్రయత్నించినా, అవి ఇప్పటికే గంటలోపే అమ్ముడయ్యాయని తెలుసుకుని నిరాశ చెందారు. “మ్యాచ్ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నా వంతు వచ్చే సరికి టిక్కెట్లు అయిపోయాయి. కానీ, ప్రస్తుతం రీసేల్ కింద Dh3,500 లేదా అంతకంటే ఎక్కువ అడుగుతున్నారు. ”అని షార్జాలో నివాసం ఉంటున్న క్రికెట్ అభిమాని అబ్దుల్ కరీం తెలిపారు.
“నేను టికెట్ కొనడానికి Dh500 కేటాయించాను,.కానీ మ్యాచ్ కోసం Dh1,000 కంటే ఎక్కువ భరించగలిగే అవకాశం లేదు. ఈ మ్యాచ్లు విపరీతమైన ధరలను చెల్లించగల వ్యక్తుల కోసం మాత్రమే అనిపిస్తుంది, ”అని హరీష్ దాస్ అనే క్రికెట్ అభిమాని తెలిపారు. భారతదేశంలోని ధరలతో పోలిస్తే దుబాయ్లో టిక్కెట్ ధర కూడా చాలా ఎక్కువని, మ్యాచ్ను స్క్రీన్పై చూడడమే చివరి అవకాశమని తెలిపారు.
క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు అత్యంత డిమాండ్లో ఉన్నందున, టిక్కెట్కు విపరీతమైన డిమాండ్ ఉంది. యూఏఈ మొత్తం నాలుగు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, సెమీఫైనల్ వంటి గేమ్లకు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కొనుగోలుదారుల నుండి బలమైన డిమాండ్ ఉంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా, అధికారిక విక్రయ సమయంలో టిక్కెట్లను పొందలేకపోయిన చాలా మంది అభిమానుల ఉత్సాహానికి ఆకాశాన్నంటుతున్న రీసేల్ ధరలు చూసి షాక్ అవుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!