పెరిగిన పసిడి, వెండి ధరలు

- July 01, 2016 , by Maagulf
పెరిగిన పసిడి, వెండి ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 200 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550కి చేరింది. ప్రపంచమార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,332.17 యూఎస్‌ డాలర్లుగా ఉంది.
రూ. 44వేల పైకి.. వెండి వెండి ధర రోజురోజుకీ పైపైకి పోతోంది. వరుసగా నాల్గో రోజు వెండి ధర పెరిగి 44వేల మార్కును దాటింది. శుక్రవారం ఒక్కరోజే పెరగడంతో కేజీ వెండి ధర రూ. 44,600కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com