31 మంది మావోయిస్టులు మృతి
- February 09, 2025
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు.
మావోయిస్టుల ఇంకా గాలింపు కొనసాగుతోంది.డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా టీమ్స్ ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్. గతంలో ఎన్కౌంటర్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు.
పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల గురించి భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం ఇంద్రావతీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు తిప్పికొట్టాయి.ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందినట్లు సమాచారం.అంతేగాక మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కాగా, వచ్చే ఏడాది నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని గత నెలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







