ఏఏఐలో ఉద్యోగాలు
- February 09, 2025
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు మార్చి 5, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అథారిటీ (http://aai.aero) అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఆన్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 224 పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) 4 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) 21 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) 47 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) మొత్తం 152 పోస్టులు ఉన్నాయి. ఏయే పోస్టులకు అర్హత ప్రమాణాలు ఏంటి? వయోపరిమితి ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హత ప్రమాణాలివే:
సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టులకు, దరఖాస్తుదారు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) పోస్టుకు బి.కాం డిగ్రీ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా కలిగి ఉండాలి.మరిన్ని అర్హతలకు సంబంధించిన సమాచారం కోసం మీరు జారీ చేసిన ఖాళీ నోటిఫికేషన్ను చెక్ చేయవచ్చు.
దరఖాస్తుదారుడి వయస్సు ఎంత ఉండాలి?
ఈ వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు మార్చి 5, 2025 నాటికి 30ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి.అదే సమయంలో, గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ కేటగిరీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము ఎంతంటే?
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ. 1000 ఉంటుంది. ఏఏఐలో ఒక ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళలు/SC/ST/PWD/మాజీ సైనికులు, శిక్షణార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుములను నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/యూపీఐ/వాలెట్ మొదలైన వాటి ద్వారా ఆన్లైన్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
AAI రిక్రూట్మెంట్ దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అధికారిక వెబ్సైట్ (http://aai.aero)ని విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో ఇచ్చిన రిక్రూట్మెంట్ ట్యాబ్కు వెళ్లండి.
- సంబంధిత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్పై ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి.
- దరఖాస్తు ఫారమ్ నింపి, రుసుము చెల్లించి సమర్పించండి.
ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే?
రాత పరీక్ష, ఇతర ప్రక్రియల ద్వారా ఎంపిక జరుగుతుంది.పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి దాదాపు రూ. లక్షా 10వేల వరకు జీతం వస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!









