రిలీజ్ కి ముందే థియేటర్లో 'అరి' సినిమా చూడాలనుకుంటున్నారా?
- February 10, 2025
పేపర్ బాయ్ సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ జయ శంకర్ ఇప్పుడు అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పూర్తయింది.ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ అరి సినిమా తెరకెక్కింది. భగవద్గీత సారాన్ని ఈ అరి సినిమాలో చూపించారు. ఇప్పటికే ఈ సినిమాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా అభినందించారు.
ఈ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష.. లాంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరిషడ్వర్గాల మీద ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ అరి సినిమా అధికారిక రిలీజ్ కి ముందే కొంతమందికి స్పెషల్ షో చూపించనున్నారు.
ఈ మేరకు దర్శకుడు జయశంకర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా గురించి పెట్టి సినిమా లవర్స్ ముందే ఈ సినిమాను చూడాలనుకుంటే తాను ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయమని, లేదా ఇచ్చిన స్కానర్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ పంపమని తెలిపారు. మరి ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అరి సినిమాని మీరు ముందుగానే చూడాలనుకుంటే దర్శకుడు ఇచ్చిన పోస్ట్ ప్రకారం డీటెయిల్స్ పంపించండి.
కొత్తగా సినిమా చేయడమే కాదు ఇలా కొత్తగా కూడా ప్రమోట్ చేస్తున్నారు మూవీ యూనిట్. అలాగే పలు అవార్డు ఫిలిం ఫెస్టివల్స్ కు అరి సినిమాని పంపిస్తున్నారు. అధికారికంగా త్వరలోనే అరి సినిమాని రిలీజ్ చేయనున్నారు.ఇక అరి తర్వాత డైరెక్టర్ జయశంకర్ బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా ఒక సినిమాని ఓకే చేసారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







