కొత్త 'రైల్ బస్సు'ని ఆవిష్కరించిన ఆర్టీఏ..ఒక్కో ట్రిప్పుకు 40 మంది ప్రయాణికులు..!!
- February 11, 2025
దుబాయ్: కొత్త 'రైల్ బస్సు'ని దుబాయ్ ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఆవిష్కరించింది. రైల్ బస్ పూర్తిగా 3D-ప్రింటెడ్ వాహనం. రీ యూజబుల్ పదార్థాలతో తయారు చేయబడిందని ఆర్టీఏ ప్రకటించింది. ఇంకా అభివృద్ధిలో దశలో ఉన్న ఇది స్వయంప్రతిపత్తి కలిగి సౌరశక్తితో నడిచే రవాణా వ్యవస్థ ఎమిరేట్లో విప్లవాత్మక ఆవిష్కరణ అవుతుందని భావిస్తున్నారు.
రైలు బస్సు మోడల్ ప్రస్తుతం మదీనాట్ జుమేరాలో ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2025లో ప్రదర్శించారు. బస్సులో రెండు వరుసల సీట్లు, దివ్యాంగుల కోసం స్థలం కేటాయించారు. ఒక్కో క్యారేజ్లో 22 సీట్లు ఉంటాయి. 40 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. సీట్ల పైన ఉంచిన స్క్రీన్లు తదుపరి స్టాప్లు, వాతావరణం, సమయంతో సహా ప్రయాణం గురించి రియల్ టైమ్ లైవ్ అప్డేట్లను అందిస్తాయి. ప్రయాణీకుల భద్రతా సూచనలు బస్సుకు ఇరువైపులా.. క్యారేజ్ రెండు చివర్లలో నియంత్రణ ప్యానెల్లు ఉన్నాయి. ఎలివేటెడ్ ట్రాక్లపై ప్రయాణిస్తుంది. ఎమిరేట్ చుట్టూ 100kmph వరకు వెళ్లేలా రూపొందించబడిన ఈ బస్సు 2.9 మీటర్ల ఎత్తు, 11.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అమలు ద్వారా ప్రపంచంలోనే అత్యంత స్మార్ట్ నగరంగా ఎదగాలనే దుబాయ్ ఆశయం నెరవేరుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







