కొత్తగా 500 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్ల ఇన్స్టాల్..!!
- February 11, 2025
యూఏఈ: 2025చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ ప్రిలిమినరీ డే సందర్భంగా ఇంధన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలోని ఇంధన, పెట్రోలియం వ్యవహారాల అండర్-సెక్రటరీ షరీఫ్ అల్ ఒలామా మాట్లాడుతూ.. 2024లో దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ EV ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా యూఏఈ తన EV ఛార్జర్ల నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. జాతీయ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా EVల విస్తృత కొనుగోలుకు మద్దతు ఇచ్చే బలమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ప్రైవేట్ రంగం, స్థానిక అధికారుల సహకారంతో ఈ సమగ్ర విధానాన్ని ప్రారంభించినట్లు అల్ ఒలామా చెప్పారు. క్లీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 14 గిగావాట్లకు పెంచాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అల్ ఒలామా చెప్పారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









