కొత్తగా 500 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్ల ఇన్స్టాల్..!!
- February 11, 2025
యూఏఈ: 2025చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ ప్రిలిమినరీ డే సందర్భంగా ఇంధన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలోని ఇంధన, పెట్రోలియం వ్యవహారాల అండర్-సెక్రటరీ షరీఫ్ అల్ ఒలామా మాట్లాడుతూ.. 2024లో దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ EV ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా యూఏఈ తన EV ఛార్జర్ల నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. జాతీయ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా EVల విస్తృత కొనుగోలుకు మద్దతు ఇచ్చే బలమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ప్రైవేట్ రంగం, స్థానిక అధికారుల సహకారంతో ఈ సమగ్ర విధానాన్ని ప్రారంభించినట్లు అల్ ఒలామా చెప్పారు. క్లీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 14 గిగావాట్లకు పెంచాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అల్ ఒలామా చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







