కొత్తగా 500 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్ల ఇన్స్టాల్..!!
- February 11, 2025
యూఏఈ: 2025చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ ప్రిలిమినరీ డే సందర్భంగా ఇంధన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలోని ఇంధన, పెట్రోలియం వ్యవహారాల అండర్-సెక్రటరీ షరీఫ్ అల్ ఒలామా మాట్లాడుతూ.. 2024లో దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ EV ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా యూఏఈ తన EV ఛార్జర్ల నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. జాతీయ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా EVల విస్తృత కొనుగోలుకు మద్దతు ఇచ్చే బలమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ప్రైవేట్ రంగం, స్థానిక అధికారుల సహకారంతో ఈ సమగ్ర విధానాన్ని ప్రారంభించినట్లు అల్ ఒలామా చెప్పారు. క్లీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 14 గిగావాట్లకు పెంచాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అల్ ఒలామా చెప్పారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







