అబుదాబిలో ఈ మూడు ప్రాంతాల్లో వెర్టిపోర్ట్ల నిర్మాణం..!!
- February 12, 2025
యూఏఈ: అబుదాబిలోని అల్ బతీన్, యాస్ ఐలాండ్, ఖలీఫా పోర్ట్తో సహా మూడు కీలక ప్రదేశాలలో వెర్టిపోర్ట్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. AI- పవర్డ్ డ్రోన్ టెక్నాలజీ, అటానమస్ ఏరియల్ లాజిస్టిక్స్లో ప్రత్యేకత కలిగిన అబుదాబి ఆధారిత కంపెనీ LODD, స్కైపోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ICAO గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ సింపోజియం (GISS) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. "వెర్టిపోర్ట్ నెట్వర్క్ అభివృద్ధి యూఏఈలో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) ఎయిర్క్రాఫ్ట్, అటానమస్ ఏరియల్ లాజిస్టిక్స్ ఆపరేషన్కు మద్దతు ఇస్తుంది" అని రెండు కంపెనీలు తెలిపాయి.
అబుదాబి ప్రజా రవాణా వ్యవస్థలో వెర్టిపోర్ట్లను నిర్మాణం అనేది పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని LODD సీఈఓ రషీద్ అల్ మనాయ్ తెలిపారు. ఈ వెర్టిపోర్ట్లు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ఎయిర్ మొబిలిటీ నెట్వర్క్కు పునాది వేస్తాయని, వాణిజ్య eVTOL ప్రయాణీకుల సేవలకు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు.
వెర్టిపోర్ట్లు ఫ్లయింగ్ ట్యాక్సీల టేకాఫ్, ల్యాండింగ్, సర్వీసింగ్ కోసం ఇవి 2026లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. జనవరి 9న, దుబాయ్ దేశంలోని మొట్టమొదటి వాణిజ్య వెర్టిపోర్ట్ను దుబాయ్ ఇంటర్నేషనల్ వెర్టిపోర్ట్ (DXV) అని నామకరణం చేశారు. దుబాయ్లో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), జాబీ ఏవియేషన్ల సహకారంతో Skyports అభివృద్ధి చేస్తున్న నాలుగు సైట్లలో DXV మొదటిది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు డౌన్టౌన్ దుబాయ్, పామ్ జుమేరా, దుబాయ్ మెరీనా లో కూడా వెర్టిపోర్ట్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
అబుదాబిలోని మూడు వెర్టిపోర్ట్లు ఎమిరేట్లోని కీలక సైట్లను కనెక్ట్ చేయడమే కాకుండా యూఏఈ అంతటా ఉన్న ప్రదేశాల మధ్య కనెక్టివిటీకి కీలకం అని స్కైపోర్ట్స్ సీఈఓ డంకన్ వాకర్ తెలిపారు. సమగ్ర ప్యాసింజర్, కార్గో నెట్వర్క్ని అభివృద్ధి చేయడం వల్ల ప్రజలు, వ్యాపారాల కోసం ఎమిరేట్కు విస్తృత ప్రయోజనాలను తీసుకురావడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









