అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- February 12, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ పౌరుడు, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులలో ఒకరికి సౌదీ పాస్పోర్ట్ను అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్షర్ ప్లాట్ఫారమ్ ద్వారా జారీ చేయడానికి కొత్త సర్వీస్ ద్వారా అనుమతించనున్నారు. అబ్షర్లో లాగిన్ అయి దరఖాస్తును సమర్పించడం ద్వారా కొత్త సేవలన పొందవచ్చని వెల్లడించారు. ఈ సేవ పౌరులు సులభంగా ఎలక్ట్రానిక్గా పాస్పోర్ట్లను పొందడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి అవసరమైన షరతులు ఒక కుటుంబం సౌదీ జాతీయతను కలిగి ఉండాలని, భార్య వయస్సు 50 ఏళ్లకు మించకూడదని నిర్దేశిస్తుంది. అవసరమైన పరిస్థితులలో మాత్రమే ఒక మహిళ బిడ్డను దత్తత తీసుకోవడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







