అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- February 12, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ పౌరుడు, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులలో ఒకరికి సౌదీ పాస్పోర్ట్ను అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్షర్ ప్లాట్ఫారమ్ ద్వారా జారీ చేయడానికి కొత్త సర్వీస్ ద్వారా అనుమతించనున్నారు. అబ్షర్లో లాగిన్ అయి దరఖాస్తును సమర్పించడం ద్వారా కొత్త సేవలన పొందవచ్చని వెల్లడించారు. ఈ సేవ పౌరులు సులభంగా ఎలక్ట్రానిక్గా పాస్పోర్ట్లను పొందడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి అవసరమైన షరతులు ఒక కుటుంబం సౌదీ జాతీయతను కలిగి ఉండాలని, భార్య వయస్సు 50 ఏళ్లకు మించకూడదని నిర్దేశిస్తుంది. అవసరమైన పరిస్థితులలో మాత్రమే ఒక మహిళ బిడ్డను దత్తత తీసుకోవడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







