అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- February 12, 2025
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. సౌదీ పౌరుడు, దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులలో ఒకరికి సౌదీ పాస్పోర్ట్ను అంతర్గత మంత్రిత్వ శాఖ అబ్షర్ ప్లాట్ఫారమ్ ద్వారా జారీ చేయడానికి కొత్త సర్వీస్ ద్వారా అనుమతించనున్నారు. అబ్షర్లో లాగిన్ అయి దరఖాస్తును సమర్పించడం ద్వారా కొత్త సేవలన పొందవచ్చని వెల్లడించారు. ఈ సేవ పౌరులు సులభంగా ఎలక్ట్రానిక్గా పాస్పోర్ట్లను పొందడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి అవసరమైన షరతులు ఒక కుటుంబం సౌదీ జాతీయతను కలిగి ఉండాలని, భార్య వయస్సు 50 ఏళ్లకు మించకూడదని నిర్దేశిస్తుంది. అవసరమైన పరిస్థితులలో మాత్రమే ఒక మహిళ బిడ్డను దత్తత తీసుకోవడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









