డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!
- February 17, 2025
దుబాయ్: డ్రగ్స్ కలిగి ఉన్నందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ సిరియా మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్లో అల్ కియాదా మెట్రో స్టేషన్ సమీపంలో 37 ఏళ్ల నిందితురాలిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. మహిళ క్రిస్టల్ మెత్ను కలిగి ఉందని , ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. మహిళ వద్ద నుండి ప్లాస్టిక్ బాటిల్లో 25.29 గ్రాముల లిక్విడ్ మెథాంఫేటమిన్, ఐదు ప్లాస్టిక్ ర్యాప్లలో 1.26 గ్రాముల క్రిస్టల్ మెత్ ను గుర్తించారు. ఆమె జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే ప్రతి 100 దిర్హామ్లకు అదనంగా ఒక రోజు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









