డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!
- February 17, 2025
దుబాయ్: డ్రగ్స్ కలిగి ఉన్నందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ సిరియా మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్లో అల్ కియాదా మెట్రో స్టేషన్ సమీపంలో 37 ఏళ్ల నిందితురాలిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. మహిళ క్రిస్టల్ మెత్ను కలిగి ఉందని , ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. మహిళ వద్ద నుండి ప్లాస్టిక్ బాటిల్లో 25.29 గ్రాముల లిక్విడ్ మెథాంఫేటమిన్, ఐదు ప్లాస్టిక్ ర్యాప్లలో 1.26 గ్రాముల క్రిస్టల్ మెత్ ను గుర్తించారు. ఆమె జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే ప్రతి 100 దిర్హామ్లకు అదనంగా ఒక రోజు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







