డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!
- February 17, 2025
దుబాయ్: డ్రగ్స్ కలిగి ఉన్నందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ సిరియా మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్లో అల్ కియాదా మెట్రో స్టేషన్ సమీపంలో 37 ఏళ్ల నిందితురాలిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. మహిళ క్రిస్టల్ మెత్ను కలిగి ఉందని , ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. మహిళ వద్ద నుండి ప్లాస్టిక్ బాటిల్లో 25.29 గ్రాముల లిక్విడ్ మెథాంఫేటమిన్, ఐదు ప్లాస్టిక్ ర్యాప్లలో 1.26 గ్రాముల క్రిస్టల్ మెత్ ను గుర్తించారు. ఆమె జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే ప్రతి 100 దిర్హామ్లకు అదనంగా ఒక రోజు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!