శిక్షణా కార్యక్రమంలో విషాదం.. ఇద్దరు సైనికులు మృతి..!!
- February 20, 2025
కువైట్: కువైట్ లో సైనిక శిక్షణా కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సైనికులు మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సబాహ్ అమరవీరులకు సంతాపం తెలిపారు. మేజర్ సార్జెంట్ అహ్మద్ ఫర్హాన్ హరత్ , సార్జెంట్ ముసాద్ ధాహి సలేహ్ రాత్రి షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతకుముందు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అమరవీరులు హరత్, సలేహ్లకు సంతాపం తెలిపారు. అదే సైనిక ఎక్సర్ సైజులో కార్పోరల్ అన్వర్ ఖలాఫ్ రద్వాన్, కార్పోరల్ ముత్లాక్ మహ్మద్ ముబారక్ గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







