శిక్షణా కార్యక్రమంలో విషాదం.. ఇద్దరు సైనికులు మృతి..!!
- February 20, 2025
కువైట్: కువైట్ లో సైనిక శిక్షణా కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సైనికులు మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సబాహ్ అమరవీరులకు సంతాపం తెలిపారు. మేజర్ సార్జెంట్ అహ్మద్ ఫర్హాన్ హరత్ , సార్జెంట్ ముసాద్ ధాహి సలేహ్ రాత్రి షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతకుముందు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అమరవీరులు హరత్, సలేహ్లకు సంతాపం తెలిపారు. అదే సైనిక ఎక్సర్ సైజులో కార్పోరల్ అన్వర్ ఖలాఫ్ రద్వాన్, కార్పోరల్ ముత్లాక్ మహ్మద్ ముబారక్ గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







