శిక్షణా కార్యక్రమంలో విషాదం.. ఇద్దరు సైనికులు మృతి..!!
- February 20, 2025
కువైట్: కువైట్ లో సైనిక శిక్షణా కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సైనికులు మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సబాహ్ అమరవీరులకు సంతాపం తెలిపారు. మేజర్ సార్జెంట్ అహ్మద్ ఫర్హాన్ హరత్ , సార్జెంట్ ముసాద్ ధాహి సలేహ్ రాత్రి షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడి మరణించారు. రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతకుముందు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అమరవీరులు హరత్, సలేహ్లకు సంతాపం తెలిపారు. అదే సైనిక ఎక్సర్ సైజులో కార్పోరల్ అన్వర్ ఖలాఫ్ రద్వాన్, కార్పోరల్ ముత్లాక్ మహ్మద్ ముబారక్ గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









