ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ..
- February 20, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్మన్ గిల్ (101 నాటౌట్; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (41; 36 బంతుల్లో 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (41 నాటౌట్; 47 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్లు చెరో వికెట్ సాధించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







