ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్
- February 23, 2025
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నట్లు జనసేన పార్టీ అధికారిక ‘ ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









