ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్
- February 23, 2025
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నట్లు జనసేన పార్టీ అధికారిక ‘ ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.పవన్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









