కేరళలోని 5 కిమీ కన్నూర్ బీచ్ రన్లో పాల్గొన్న యూఏఈ మంత్రి..!!
- February 23, 2025
యూఏఈ: ప్రపంచ ఐక్యతకు సూచనగా, యూఏఈ మంత్రి ఒకరు కేరళలో ఆదివారం నిర్వహించిన రన్ లో పాల్గొన్నారు. ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ కోసం కేరళ వచ్చిన యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ.. కన్నూర్ బీచ్ రన్ 8వ ఎడిషన్లో 5 కి.మీ పరుగులో పాల్గొన్నారు. యూఏఈ ఆధారిత VPS హెల్త్కేర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వాయలీల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి రన్ లో పాల్గొని సందడి చేశారు.
అల్ మర్రి రన్ ముగిసాక మాట్లాడుతూ.. " సోదరుడు డాక్టర్ వయాలీల్తో కలిసి ఇక్కడ కన్నూర్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చొరవను ప్రారంభించాము.. ఈ రోజు ఇక్కడకు వచ్చి అందులో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది కేరళ ప్రజలతో కలిసి ఇక్కడ మరో పరుగు తీయాలని ఉంది." అని తెలిపారు.
యూఏఈలో దాదాపు పది లక్షల మంది కేరళీయులు నివసిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రవాసులలో సమాజ సేవా కార్యక్రమాల గురించి అవగాహన పెంచింది. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి పాల్గొనడాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్వాగతించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. అతడి రాకతో 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ రన్' థీమ్, స్ఫూర్తిని పెంచింది.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







