ఒమన్ లో ఫుడ్ పబ్లిక్ వినియోగం పై నిషేధం..!!
- March 02, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించడం ఒమన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 277 ప్రకారం నిషేధించారు. ఈమేరకు 7/2018 రాయల్ డిక్రీ జారీ చేసింది. "మతాన్ని ప్రభావితం చేసే నేరాలు" అనే అధ్యాయం కింద ఫుడ్ సంబంధిత సెక్షన్లను నమోదు చేశారు. వాటి ప్రకారం.. "రమదాన్ లో పగటిపూట ఉపవాసం విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించే ఎవరైనా 10 రోజుల కంటే తక్కువ, 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడతారు." అని పేర్కొన్నారు. ఈ చట్టం పవిత్ర రమదాన్ మాసంలో మతపరమైన ఆచారాలను సమర్థించడం, పబ్లిక్ డెకోరమ్ను నిర్వహించడంలో ఒమన్ సుల్తానేట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







