ఒమన్ లో ఫుడ్ పబ్లిక్ వినియోగం పై నిషేధం..!!
- March 02, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించడం ఒమన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 277 ప్రకారం నిషేధించారు. ఈమేరకు 7/2018 రాయల్ డిక్రీ జారీ చేసింది. "మతాన్ని ప్రభావితం చేసే నేరాలు" అనే అధ్యాయం కింద ఫుడ్ సంబంధిత సెక్షన్లను నమోదు చేశారు. వాటి ప్రకారం.. "రమదాన్ లో పగటిపూట ఉపవాసం విరమించే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులను బహిరంగంగా వినియోగించే ఎవరైనా 10 రోజుల కంటే తక్కువ, 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడతారు." అని పేర్కొన్నారు. ఈ చట్టం పవిత్ర రమదాన్ మాసంలో మతపరమైన ఆచారాలను సమర్థించడం, పబ్లిక్ డెకోరమ్ను నిర్వహించడంలో ఒమన్ సుల్తానేట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







