మానవ అక్రమ రవాణా కేసు..మహిళ పై విచారణ..!!
- March 04, 2025
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై మార్చి 11న హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఆమె ఒక గృహ కార్మికురాలిని బలవంతంగా ఉద్యోగంలో నియమించి, ఆమె వేతనాలను తీసుకున్నారని, ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఆపడానికి పాస్పోర్ట్ను తన వద్ద ఉంచుకున్నారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ఆ మహిళ సరైన వర్క్ పర్మిట్ లేకుండా కార్మికురాలిని అనేక ఇళ్లలో పని చేయించిందని ఆరోపిస్తూ మానవ అక్రమ రవాణా నిరోధక , ప్రజా నైతిక రక్షణ డైరెక్టరేట్ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. పరిస్థితులు చట్టపరరంగా లేవని, కార్మికురాలు వెళ్ళిపోయే మార్గం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
అధికారులు బాధితురాలిని, సాక్షులను విచారించారు. ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను సేకరించారు. పోలీసు విచారణలో బాధితురాలు చెప్పిన విషయాలు వాస్తవాలని తేలాయి. కేసు పూర్తయిన తర్వాత, ప్రాసిక్యూషన్ దానిని విచారణ కోసం కోర్టు ముందుకు తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









