మానవ అక్రమ రవాణా కేసు..మహిళ పై విచారణ..!!
- March 04, 2025
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై మార్చి 11న హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఆమె ఒక గృహ కార్మికురాలిని బలవంతంగా ఉద్యోగంలో నియమించి, ఆమె వేతనాలను తీసుకున్నారని, ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఆపడానికి పాస్పోర్ట్ను తన వద్ద ఉంచుకున్నారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ఆ మహిళ సరైన వర్క్ పర్మిట్ లేకుండా కార్మికురాలిని అనేక ఇళ్లలో పని చేయించిందని ఆరోపిస్తూ మానవ అక్రమ రవాణా నిరోధక , ప్రజా నైతిక రక్షణ డైరెక్టరేట్ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. పరిస్థితులు చట్టపరరంగా లేవని, కార్మికురాలు వెళ్ళిపోయే మార్గం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
అధికారులు బాధితురాలిని, సాక్షులను విచారించారు. ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను సేకరించారు. పోలీసు విచారణలో బాధితురాలు చెప్పిన విషయాలు వాస్తవాలని తేలాయి. కేసు పూర్తయిన తర్వాత, ప్రాసిక్యూషన్ దానిని విచారణ కోసం కోర్టు ముందుకు తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









