ప్రభుదేవా తో కలిసి చిందేసిన తమన్నా

- July 04, 2016 , by Maagulf
ప్రభుదేవా తో కలిసి చిందేసిన తమన్నా

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రభుదేవాతో కలిసి మిల్కీబ్యూటీ తమన్నా అద్భుతమైన స్టెప్పులు వేశారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అభినేత్రి' చిత్రం రిహార్సల్స్‌లో భాగంగా తీసిన ఒక వీడియోను తమన్నా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తమన్నా.. ప్రభుదేవా, పరేశ్‌ శిరోద్కర్‌తో కలిసి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌కు అభిమానులే కాదు... పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. శ్రుతిహాసన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, ఖుష్బు, విద్యులేఖ రామన్‌ ట్విట్టర్‌ ద్వారా తమన్నాను ప్రశంసించారు. వీరందరికీ మిల్కీబ్యూటీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుదేవా కూడా తమన్నా ఒక్కటే రిహార్సల్స్‌ చేస్తున్న ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.
ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న 'అభినేత్రి' చిత్రానికి కోనా వెంకట్‌ కథ అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్‌, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనే కోరికతో 'అభినేత్రి'లో నటిస్తున్నట్లు టీజర్‌ విడుదల కార్యక్రమంలో తమన్నా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com