ప్రభుదేవా తో కలిసి చిందేసిన తమన్నా
- July 04, 2016
ఇండియన్ మైఖేల్ జాక్సన్గా గుర్తింపు పొందిన ప్రభుదేవాతో కలిసి మిల్కీబ్యూటీ తమన్నా అద్భుతమైన స్టెప్పులు వేశారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అభినేత్రి' చిత్రం రిహార్సల్స్లో భాగంగా తీసిన ఒక వీడియోను తమన్నా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తమన్నా.. ప్రభుదేవా, పరేశ్ శిరోద్కర్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్కు అభిమానులే కాదు... పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. శ్రుతిహాసన్, దేవిశ్రీ ప్రసాద్, ఖుష్బు, విద్యులేఖ రామన్ ట్విట్టర్ ద్వారా తమన్నాను ప్రశంసించారు. వీరందరికీ మిల్కీబ్యూటీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుదేవా కూడా తమన్నా ఒక్కటే రిహార్సల్స్ చేస్తున్న ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న 'అభినేత్రి' చిత్రానికి కోనా వెంకట్ కథ అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనే కోరికతో 'అభినేత్రి'లో నటిస్తున్నట్లు టీజర్ విడుదల కార్యక్రమంలో తమన్నా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







