శ్రీ చైతన్య సీబీఎస్ఈ వివో-ఐపీఎల్ పాఠశాలలో ఘనంగా 1st యాన్యువల్ డే వేడుకలు.
- March 11, 2025
తెలంగాణ: కరీంనగర్ పట్టణంలో చింతకుంట లో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ సిఓ-ఐపీఎల్ బ్రాంచ్ లో ఘనంగా అన్యువల్ డే వేడుకలు జరిగాయి.సభ అధ్యక్షలు సీబీఎస్ఈ సీవో-ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజుకుమార్ ఆచార్య వేదికపైకి ముఖ్య అతిధుల ఆహ్వానించి యాన్యువల్ డే ప్రోగ్రాం ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా, మానకొండూరు ఎమ్మెల్యే కపంపల్లి సత్యనారాయణ సూడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ ఏసిపి గంగాధర్, మహేష్ ఆర్డీవో కరీంనగర్, శ్రీ చైతన్య ఫస్ట్ యానిమల్ డే సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ పాల్గొన్న నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు విద్యార్థులందరికీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ అన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల్లో మానసికంగానే కాకుండా శారీరక అభివృద్ధి కూడా తోడ్పడాలని తెలియజేశారు.విద్యార్థుల్లో కల్చరల్ ఆక్టివిటీస్ పెంపొందిస్తూ అటు చదువుల్లోనూ ఇటు ఆటల్లోనూ ఇటు పాటల్లోనూ మంచి ప్రతిభ కనబరిచారని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య డైరెక్టర్ సీమ, జిఎం నాగేంద్ర, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్స్ శ్రీవిద్య, కరీంనగర్ జోన్ ఏజీఎం ఎం రాజు, మంచిర్యాల జోన్ ఏజీఎం అరవింద్ రెడ్డి, ఏజిఎం (ఆపరేషన్) సదాశివ రెడ్డి, చీఫ్ అకాడమీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ జోన్ అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, వారందరూ మాట్లాడుతూ ఈరోజు యానిమల్ డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యార్థులంటే కేవలం చదువులకే పరిమితం కాకుండా ఇటు ఆటలోనూ పాటల్లోను మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతి ఏటా పదవ తరగతి ఫలితాల్లోనూ, ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ, ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లోనూ ఎక్కడ చూసినా శ్రీ చైతన్య విద్యార్థులు కనబడుతున్నారు.దాని ఉద్దేశం మా విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రత్యేక ఉత్తమమైన భవిష్యత్తుని కాకుండా ప్రతి రంగంలోనూ మా శ్రీ చైతన్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాము. రాబోయే రోజులలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్యతోపాటు మానసికంగా మరియు శారీరకంగా అభివృద్ధి చేసే విధంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. 7 బ్రాంచ్ నుండి విద్యార్థులు డ్యాన్స్,స్పీచ్, కల్చరల్ యాక్టివిటీలు ఏడు బ్రాంచ్ల నుండి 5000 మంది విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు సహకరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజుకుమార్ ఆచార్య సీబీఎస్ఈ సీవో ఐపీఎల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ యాన్యువల్ డే సీబీఎస్ సీఈవో ఐపీఎల్ బ్రాంచ్ నుంచి ప్రతి ఏటా దాదాపు 200 మంది విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారు,ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధిస్తూ ఐఐటి పోటీ పరీక్షలలో ఐఐటి సీట్లు కూడా సాధిస్తూ విదేశాలలో అవకాశాల్ని దక్కించుకున్న ఏకైక విద్యాసంస్థ అది శ్రీ చైతన్య సీబీఎస్ఈ సీఈఎల్ బ్రాంచ్ మాత్రమే వారు తెలియజేశారు. గత చాలా సంవత్సరాలు క్రితం చదువుకున్న విద్యార్థులందరికీ ప్రతిఏటా వివిధ సంస్థలలో దాదాపు సంవత్సరానికి 56 లక్షల ప్యాకేజీ సాధించినటువంటి విద్యార్థులు మన బ్రాంచ్ నుంచే ఉన్నారు. ఇది చదువులోనే కాదు ఆటల్లోనూ ప్రపంచస్థాయి పోటీలలో, ఇండియా క్రికెట్ మహిళా జట్టులో స్థానం సాధించి అండర్ 19 వరల్డ్ కప్ కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థిని కూడా మన శ్రీ చైతన్య విద్యాసంస్థల్లోనే ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలాంటి పోటీలోనైనా మా శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరుస్తారు. వాళ్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్న మా ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బోయవాడ, తిమ్మాపూర్, వావిలలాపల్లి, మల్కాపూర్, సుల్తానాబాద్, విద్యారణ్యపురి, శ్రీ సౌధ, ప్రిన్సిపల్స్, డీన్స్, జోనల్ పిఈటీలు, ఔట్సోర్సింగ్ జోనల్ ఇంచార్జ్ కళ్యాణ్, రంజిత్, వైస్ ప్రిన్సిపల్ లీలావతి,సివో ఐపీఎల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇన్చార్జి జయవర్ధన్ రెడ్డి ఏవో హరికృష్ణ రెడ్డి, క్యాంపస్ ఇన్చార్జి నాగేంద్ర మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పి.ఈ.టి లు, విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)



తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







