జెడ్డాలో కీలకమైన అమెరికా-ఉక్రేనియన్ చర్చలు ప్రారంభం..!!
- March 12, 2025
జెడ్డా: రష్యాతో యుద్ధాన్ని ముగించే మార్గాన్ని కనుగొనడానికి యునైటెడ్ స్టేట్స్, ఉక్రెయిన్ సీనియర్ అధికారులు మంగళవారం సౌదీ నగరమైన జెడ్డాలో తమ కీలకమైన చర్చలను ప్రారంభించారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడం, శాంతి ఒప్పందం కోసం నిర్ణయాత్మక చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ నేతృత్వంలోని ఉక్రేనియన్ బృందంతో జరిగిన చర్చలలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ , విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా పాల్గొన్నారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ , జాతీయ భద్రతా సలహాదారు ముసాద్ అల్-ఐబాన్ చర్చలకు సమన్వయకర్తలుగా వ్యవహారించారు.
"అమెరికా బృందంతో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా ప్రారంభమైంది" అని ఆండ్రీ యెర్మాక్ అన్నారు. "ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన మూడు సంవత్సరాల తర్వాత న్యాయమైన మరియు స్థిరమైన శాంతిని నెలకొల్పడానికి మేము కృషి చేస్తున్నాము." అని పేర్కొన్నారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్తో తన సమావేశం తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.."ఈ చర్చలలో ఉక్రెయిన్ స్థానం పూర్తిగా నిర్మాణాత్మకంగా ఉంటుంది" అని నొక్కి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై తన బృందం అమెరికా అధికారులతో చర్చలకు సన్నాహకంగా జెలెన్స్కీ సోమవారం సాయంత్రం జెడ్డాకు చేరుకుని క్రౌన్ ప్రిన్స్తో సమావేశమయ్యారు.
ఫిబ్రవరి 19న, రియాద్ ఉన్నత స్థాయి దౌత్యానికి వేదికగా మారింది. రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా-రష్యన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటువంటి మొదటి సమావేశం ఇది. చర్చలు గణనీయమైన దౌత్య పురోగతికి దారితీశాయి. ఇరుపక్షాలు తమ దౌత్య కార్యకలాపాల నుండి సిబ్బందిని తిరిగి పంపడానికి, ఆర్థిక సహకారాన్ని పెంచడానికి అంగీకరించాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







