ఏపీ: యువతకు గుడ్ న్యూస్..
- March 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీఎస్ఎస్డీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
ఇందులో భాగంగా ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో యువతక ఐటీ ఆధారిత కంపెనీల్లో ఉపాది అవకాశాలు పెరుగుతాయిని అధికారులు తెలిపారు.
మరోవైపు విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









