రూ.500 కోట్లతో తిరుపతి మోడల్ బస్ స్టేషన్
- March 13, 2025
తిరుపతి: తిరుపతిలో రూ.500కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనులను త్వరలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో చేపట్టనున్నట్టు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.ప్రతిపాదిత మోడల్ బస్ స్టేషన్ తాజా స్థితిపై తిరుపతి లోక్ సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి పార్లమెంట్ లో వివరణ కోరారు.
అందుకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ… తిరుపతి ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించి బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ డిజైన్ను సంబంధిత వర్గాల సూచనలతో మెరుగు పరిచే పనులు జరుగుతున్నాయన్నారు. ప్రయాణికుల రవాణా సౌకర్యం, భద్రత, వేగవంతమైన రాకపోకలకు అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నారని పేర్కొన్నారు.
డిజైన్ సిద్దమైన వెంటనే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ప్రాజెక్ట్ అమలు చేయనుందని తెలిపారు. ఏడాది క్రితం ఎంపీ గురుమూర్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







