సౌదీ అరేబియా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు..!!
- March 16, 2025
రియాద్: నివాస, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు మార్చి 6-మార్చి 12 మధ్య అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీ అరేబియా అంతటా తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. నివాసానికి సంబంధించిన 16,644, సరిహద్దు భద్రతకు 3,896, కార్మిక చట్టాలకు 3,325 సహా మొత్తం 23,865 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
అదే సమయంలో రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 1,432 మందిని అధికారులు అడ్డుకున్నారని, వీరిలో 29% యెమెన్లు, 67% ఇథియోపియన్లు, 4% ఇతర దేశాల వారు ఉన్నారని తెలిపారు. అలాగే ఉల్లంఘనపరులకు సహాయం చేసిన 13 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం 39,976 మంది ప్రవాసులు (36,307 మంది పురుషులు, 3,669 మంది మహిళలు) నిబంధనల అమలు కోసం వివిధ ప్రక్రియలను ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రవేశం, రవాణా, ఆశ్రయం కల్పించడం లేదా ఉల్లంఘించిన వారికి సహాయం అందించిన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SAR 1 మిలియన్ వరకు జరిమానా విధించవచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్, తూర్పు ప్రాంతాలలో 911 కు.. రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలో 999 లేదా 996 కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







