బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడు
- July 31, 2016ఒక చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమా బిచ్ఛగాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ వంద రోజుల వేడుకకి రెడీ అవుతుంది. అయితే డబ్బింగ్ సినిమా కావటంతో ఈ మూవీకి నిర్మాత సైతం తక్కువ పబ్లిసిటీని ఇచ్చారు. ఇక మార్కెట్ లో ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే లాభీయింగ్ చేసి మరీ యాడ్స్ తెచ్చుకునే మీడియా సైతం ఈ మూవీని అంతగా పట్టించుకోలేదు.ఒక్కసారిగా ఈ మూవీకి వచ్చిన సక్సెస్ ని చూసిన మీడియా యాడ్స్ కోసం వెంట పడింది. అప్పటికే ఈ మూవీ 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకుంది. మొదట్లోనే మీడియాకి యాడ్స్ ని ఇవ్వని నిర్మాత, 50 రోజుల వేడుక తరువాత అక్షింతలు వేసినట్టుగా కొద్ది ఛానల్స్ కి మాత్రమే యాడ్స్ ని పరిమితం చేశాడు. ఇప్పుడు ఈ మూవీ 100 రోజులు వేడుకకి రెడీ అవుతుంది.200 థియేటర్లలో 75రోజులను ముగించుకొని ఈ ప్రయాణం కొనసాగుతుంది. దీంతో మీడియా బిచ్ఛగాడు 100 రోజుల వేడుకకి భారీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిర్మాత మాత్రం మీడియాకి చుక్కలు చూపిస్తున్నారు. బిచ్ఛగాడు కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయిన సినిమా, ఏ ఛానల్ కి యాడ్స్ ని ఇవ్వలేదు.ఇప్పుడు కూడ అనవసరం అంటూ మీడియాని దూరం పెడుతున్నారంట. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా రిపోర్ట్స్ బయటకు చెప్పుకోవటం విశేషం. ఏదైమానా బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ హీరో తెలుగులో డైరెక్ట్ మూవీకి రెడీ అవ్వటం విశేషం.
తాజా వార్తలు
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!