రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 22, 2016రోడ్డు ప్రమాదంలో విజిబిలిటీ కారణంగా 25 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అబుదాబీ పోలీస్ జనరల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అలి ఖల్ఫాన్ అల్ ధాధెరి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడ్డవారిని తవామ్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందించిన వెంటనే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. అక్కడికక్కడే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్నవారిని అల్ అయిన్లోని తవామ్ ఆసుపత్రికి తరలించారు. లో విజిబిలిటీ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాహనదారులు పరిస్థితులకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి ఉంటుందనీ, లో విజిబిలిటీ ఉన్నప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలనీ, తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని, ముందు వెళ్ళే వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి