ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు
- November 24, 2016మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారనీ, వాటిని వినియోగించారనే అభియోగాలు వారిపై మోపబడ్డాయి. మమీర్లో ఓ పోలీస్ అధికారిని చంపేందుకు కూడా ఈ వ్యక్తులు కుట్ర పన్నిన కేసులో దోషులుగా తేలారని చీఫ్ ప్రాజిక్యూటర్ హమాద్ షహీన్ చెప్పారు. 2015 మే 30న మమీర్ విలేజ్లో బాంబుల్ని పెట్టి ఓ పోలీస్ అధికారిని చంపడానికి ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా అక్కడే నక్కి ఉన్నవారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు ఒకవేళ పేలి ఉంటే తీవ్రమైన నష్టం వాటిల్లేది. అన్ని వాదనల్నీ విన్న న్యాయస్థానం, సాక్ష్యాధారాల్ని పరిశీలించి, నిందితులకు జీవిత ఖైదును విధించింది. నిందితుల తరఫున కూడా వాదనలకు ఆస్కారం కలిగిందిగానీ, నేర నిరూపణ అవడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం