జనవరి 8 నుంచి ఇండియన్ స్కూల్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 05, 2017మస్కట్: మస్కట్లోని ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8న ప్రారంభం కానుంది. కెజి నుంచి 9వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ ఈ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేరెంట్స్కి, అలాగే స్కూల్స్కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ వాడి కబిర్, ఇండియన్ స్కూల్ గుబ్రా, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మయీబెలా తదిర స్కూళ్ళకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 15తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన అప్లికేషన్ని, అవసరమైన డాక్యమెంట్లతోపాటు పైన పేర్కొనబడిన ఆరు స్కూళ్ళలో ఏదో ఒక దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్లోనూ పేరెంట్స్కి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు