మరణశిక్ష నుంచి 10 మంది భారతీయులకు ఉపశమనం లభిస్తుందా?
- March 26, 2017అల్ అయిన్ జైల్లో ఉన్న పది మంది భారతీయ యువకులు మరణశిక్ష నుంచి ఉపశమనం పొందుతారా? అని వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. ఓ పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన కేసులో మొత్తం 11 మంది నిందులు కాగా, అందులో ఒకరికి మరణశిక్ష నుంచి మినహాయించారు. మిగతా 10 మందికి మరణ శిక్ష పడగా, మృతుడి తండ్రి నుంచి వారికి క్షమాభిక్ష లభించింది. 'నా కొడుక్కి జరిగినట్లే వారికీ జరగాలని కోరుకోవడంలేదు. నా కుటుంబం చాలా నష్టపోయింది, అలాగే వారి కుటుంబాలు నష్టపోకూడదని కోరుకుంటున్నాను' అని మృతుడు మొహమ్మద్ ఫర్హాన్ తండ్రి చెప్పారు. దాంతో, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి 'బ్లడ్ మనీ'ని ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేయడం జరిగిందని అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ - కమ్యూనిటీ ఎఫైర్స్ దినేష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 12న ఈ కేసు హియరింగ్కి రానుంది. 'బ్లడ్ మనీ'ని సర్బత్ దా బాలా ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లించిందని సంస్థ ఛైర్మన్ ఎస్పిఎస్ ఒబెరాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ