సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో రన్వేపై ఢీకొన్న విమానాలు
- March 30, 2017సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. రన్వేపై టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అయితే పైలెట్లు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పి.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
303 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో చైనాలోని టియాంజిన్ వెళ్తున్న స్కూట్ ఎయిర్లైన్ విమానం చాంగీ ఎయిర్పోర్టు రన్వేపై టేకాఫ్కు సిద్ధమైంది. ఇంతలో స్కూట్ విమానం లెఫ్ట్ వింగ్.. అదే రన్వేపై టేకాఫ్ చేసుకుంటున్న ఎమిరేట్స్ విమానాన్ని తాకాయి.
అయితే పైలెట్లు అప్రమత్తమై విమానాలను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను దింపేసి.. దెబ్బతిన్న విమానాలను రిపేర్కు పంపించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.
ఎమిరేట్స్ విమానం దుబాయికి వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..