యోగా దినోత్సవం: మస్కట్ లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్
- May 25, 2017ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతి ఇండియన్ ఎంబసీలోనూ ఓ యోగా టీచర్ని ఏర్పాటు చేసి, సంవత్సరమంతా యోగా సెషన్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 69/131 రిజల్యూషన్స్ని ఆమోదించింది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేస్తూ. మస్కట్లో ఇండియన్ ఎంబసీ ప్రతి ఏడాదీ, ఒమన్కి చెందిన యోగా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమిస్తూ వస్తోంది. 3000 మంది ఒమనీయులు, ఇండియన్స్, ఇతర దేశాలకు చెందినవారితో కలిసి భారీ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా ఘనంగా ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం