రస్ అల్ ఖైమా: 363 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017సుప్రీం కౌన్సిల్ మెంబర్, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 363 మంది ఖైదీలను విడుదల చేస్తూ క్షమాభిక్షను ప్రసాదించారు. పవిత్ర రమదాన్ మాసం, అలాగూ యూఏఈ 'ఇయర్ ఆఫ్ గివింగ్' కార్యక్రమంలో భాగంగా ఈ క్షమాభ్షిను ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖైదీలకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించేందుకు కూడా షేక్ సౌద్ సుముఖత వ్యక్తం చేశారు. రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ కౌన్సిల్ ఛైర్మన్కి ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ, క్షమాభిక్షకు సంబంధించి అవసరమైన వ్యవహారాల్ని చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి. క్షమాభిక్ష పొందినవారు సమాజంలో మంచి పౌరులుగా జీవించాలనీ, వారి కుటుంబాలకు మంచి జీవితాన్ని అందించడంతోపాటు, దేశ ప్రగతిలోనూ భాగం కావాలని ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు