పెట్రోకెమికల్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం దెబ్బతిన్న 27 వాహనాలు
- May 25, 2017అల్ రాయ్:స్థానిక పెట్రోకెమికల్ కర్మాగారంలో బుధవారం సంభవించిన ఒక అగ్నిప్రమాదం సమర్ధవంతంగా అదుపు చేసినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం ఉదయం రాయ్ ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల పరిధిలో పెట్రోకెమికల్స్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక నియంత్రణ సమయంలో 27 వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2,000 చదరపు మీటర్ల పెట్రోకెమికల్ ప్లాంట్లో అగ్నిని అదుపులోనికి తెచ్చేందుకు ఆరు అగ్నిమాపక బృందాలు తక్షణమే ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి. ఎలాగైతే, పెట్రోకెమికల్ కర్మాగారంలో ఎగిసిపడిన భారీ జ్వాలలను అదుపు చేసినప్పటికీ పెద్ద స్థాయిలో ఆస్తులు నష్టం వాటిల్లిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒప్పుకుంది. ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద సంఘటనకు ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి సంబంధిత అధికారులచే పరిశోధన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు