ఇజ్రాయిల్లో ఐఎస్ ఉగ్రవాదల తొలి దాడి
- June 16, 2017 తమ అరాచక చర్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. తాజాగా మరోదాడికి పాల్పడింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంలోని ఓల్డ్సిటీ శివారులో ఓ మహిళా పోలీస్ అధికారిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అనంతరం ముష్కరులను పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఈ దాడి గురించి ఐఎస్ ఆన్లైన్లో పోస్టుచేసింది. ‘యూధులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో ఓ మహిళా పోలీస్ను కత్తితో పొడిచి హతమార్చాం’ అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే ఇది చివరి దాడి కాదని.. ఇంకా ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటామని ఐఎస్ పేర్కొంది. కాగా.. ఇజ్రాయిల్లో ఐఎస్ దాడికి పాల్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జెరూసలెంలోని అల్ ఆఖ్సా మసీదు సమీపంలో శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు ఆగంతకులు పోలీసులపై దాడి చేశారు. ఇందులో ఇద్దరు కాల్పులకు పాల్పడగా.. మూడో వ్యక్తి హదస్ మల్కా అనే మహిళా పోలీసును కత్తులతో పొడిచాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడి ముగ్గురు దుండగులను మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన హదస్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఐఎస్ ఉగ్రవాదులు కాదని, పాలస్తీనాకు చెందిన సున్నీ-ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హమస్ చెబుతోంది. స్థానిక తిరుగుబాటు దారులో కాల్పులకు పాల్పడినట్లు హమస్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు