పాలస్తీనాలో మళ్లీ కాల్పులు, ఆరుగురు మృతి
- July 22, 2017పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైనికుల ఆగడాలకు అమాయక పౌరులు బలైపోతు న్నారు. గతరెండు రోజులుగా వెస్ట్బ్యాంక్లో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. జెరూసలేం పాతనగరంలోని ప్రఖ్యాత ముస్లిం ప్రార్థనా మందిరం టెం పుల్ మౌంట్ వద్ద ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించింది. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి, జెరూసలేం గోడకు సమీపంలో ఇనుపకంచె వేసింది. ప్రార్థనా మందిరం వైపు పాలస్తీనా పౌరులెవర్నీ వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భద్రతాబలగాలకు, పాలస్తీనా పౌరుల మధ్య తీవ్రఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లోనే వారిపై భద్రతా బలగా లు కాల్పులు జరిపారు. టెంపుల్మౌంట్ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్రమిత ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లతో ప్రవేశ ద్వారాలను ఏర్పాటుచేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్తో ఉన్న సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నామని ఆయన ప్రక టించారు. ప్రఖ్యాత మసీదు 'అల్ అక్సా' నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్