టెక్సాస్ కు భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన ట్రంప్
- September 03, 2017హార్వే తుఫాన్ సృష్టించిన బీభత్సం టెక్సాస్ను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అమెరికా రాష్ట్రానికి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ నష్టపరిహారాన్ని అందించాలనుకుంటున్నారు. సహాయక చర్యల కోసం మొదటి దఫాగా సుమారు 50 వేల కోట్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే అంత మొత్తం ఆర్థిక సాయం అందించాలంటే ముందుగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల వరద బాధితులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ అకౌంట్ను రిలీజ్ చేసేందుకు కావాల్సిన చర్యలపై ట్రంప్ అమెరికా కాంగ్రెస్తో మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒకసారి టెక్సాస్ వెళ్లిన ట్రంప్ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హరికేన్ హార్వే వల్ల సుమారు 47 మంది చనిపోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా