ప్రాన్స్ మంచూరియా
- November 06, 2017కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పచ్చిరొయ్యలు - 300 గ్రా., ఉల్లితరుగు - 1 కప్పు, మైదా - 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు, అల్లం, వెలుల్లి తరుగు - 1 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అజినమోటో - చిటికెడు, టమోటా, చిల్లీ, సోయా సాస్లు + వెనిగర్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం - 1, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : రొయ్యలను మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూను సోయా సాస్, ఉప్పులతో కలిపి గంటసేపు పక్కనుంచి నూనెలో దోరగా వేగించాలి. కొద్ది నూనెలో వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనీగర్, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించాలి. రొయ్యలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి కరిగించిన కార్న్ఫ్లోర్ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం