అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
- December 06, 2017పై చదువుల కోసం ఎంతో సంతోషంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. కుత్భుల్లాపూర్ సూరారంకు చెందిన నాగ తులసీరామ్(26) మంగళవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీరామ్ను ఓ మహిళ కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిడ్జిపోర్టు యూనివర్సిటీలో నాగ తులసీరామ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే నాగ తులసీరామ్ తల్లి మృతిచెందింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు